యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 50 మందకి పైగా సివిల్స్కు ఎంపిక అయినట్లు ఆయన వెల్లడించారు. మహబూబ్నగర్కు చెందిన దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు దక్కించుకోగా..సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. పాలమూరు బిడ్డ మూడోర్యాంకు సాధించడం హర్షణీయమన్నారు. హన్మకొండకు చెందిన జయసింహారెడ్డికి 104వ ర్యాంకు లభించింది. వరంగల్కు చెందిన సయింపు కిరణ్కు 568 వ ర్యాంకు, నెల్లూరు సాయితేజకు 558 వ ర్యాంకుతో ప్రతిభ కనబర్చారు. ఈ సంవత్సరం 1016 మందిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లోకి ఎంపిక చేసింది.