ఇదే నిజం, గొల్లపల్లి : గొల్లపల్లి ఆదర్శ పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు,ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. ఇంటి నుంచి తెచ్చిన మొక్కలను విద్యార్థులు ఉత్సాహంగా నాటారు. ఈ సందర్భంగా మొక్కల ప్రాధాన్యతను పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్కుమార్,వైస్ ప్రిన్సిపాల్ కె.నగేష్, ఉపాధ్యాయులు రవికుమార్, రాకేష్, ప్రవీణ్ కుమార్, పున్నం చందర్, అభిషేక్, రవీందర్,రజిత, విద్యార్థులు పాల్గొన్నారు.