HomeతెలంగాణVH:సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి -కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

VH:సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి -కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

VH:ప్రతి పార్లమెంట్ నియోజక పరిధిలోలో బీసీలకు మూడు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు డిమాండ్ చేశారు . గాంధీభవన్ లో బుధవారం అయన మీడియాతో మాట్లాడారువచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు . బీసీల్లో చైతన్యం వచ్చిందని త్వరలో బీసీ గర్జన సభ నిర్వహిస్తామని వెల్లడించారు .

కాంగ్రెస్ బీసీ గర్జన సభకు కర్ణాటక సీఎం సిద్ద రామయ్యను ఆహ్వానిస్తామని చెప్పారు . బీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు . రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి జిల్లాకు తీసుకువెళ్తామని అన్నారు . బీసీలకు టిక్కెట్లు కావాలని ఎవరు అడిగినా మంచిదే స్వాగతిస్తామని అన్నారు . నరేంద్ర మోదీ బీసీలకు ఇప్పటి వరకు ఏం చేయలేదని విమర్శించారు .

కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ పేదలకు ఇచ్చిన భూములను బిఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందన్నారు . కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి తాసీల్ధార్స్ కు పని లేకుండా చేశారన్నారు . ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు . తెలంగాణలో రైతులు చనిపోతే ఆర్ధిక సహాయం చేయని కేసీఆర్ బీహార్,పంజాబ్ రైతులకు మాత్రం తెలంగాణ డబ్బులు ఇచ్చారని విమర్శించారుతెలంగాణలో బీజేపీ పని ఖతం అయిందదని ,తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు

Recent

- Advertisment -spot_img