Homeహైదరాబాద్latest Newsగుండెపోటుతో విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ మృతి

గుండెపోటుతో విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ మృతి

సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణం చెందారు. ఉదయం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మంగళవారం ఉదయం ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్‌ డీజీ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజీవ్‌ రతన్‌ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్​గా పని చేస్తున్నారు.

1991 ఐపీఎస్​ బ్యాచ్​కు చెందిన రాజీవ్​ రతన్​ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ విచారణకు ఆయనే సారథ్యం వహించారు. గతంలో కూడా ఆయన కరీంనగర్​ ఎస్పీగా, ఫైర్​ సర్వీసెస్​ డీజీగా, ఆపరేషన్​ ఐజీగా పని చేశారు. హైదరాబాద్​ రీజియన్​ ఐజీగా, పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​ ఎండీగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు.

Recent

- Advertisment -spot_img