Homeహైదరాబాద్latest Newsవిధులకు డుమ్మా కొట్టే ఉపాధ్యాయులపై నిఘా పెంచాలి

విధులకు డుమ్మా కొట్టే ఉపాధ్యాయులపై నిఘా పెంచాలి

– డీఈవోను కోరిన ఎస్ఎఫ్ఐ కమిటీ

ఇదేనిజం, దేవరకొండ : విధులకు హాజరుకానీ ఉపాధ్యాయులపై నిఘా పెంచి, చర్యలు తీసుకోవాలని ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా డీఈవోకు వినతిపత్రం అందజేశారు. దేవరకొండ నియోజకవర్గం, చందంపేట మండలం తెల్ దేవరపల్లిలో ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరుకావడం లేదని, అలాగే నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం పెద్దతండ,ఇంద్రానగర్​ పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు చూపించి విద్యాశాఖ అధికారులను తప్పుదోవ పట్టించారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల నుంచి జీతాలు రీకవరి చేయించాలని తిమ్మాపురం పుట్టలగడ్డ సమయపాలన కాక ముందే పాఠశాలకు తాళం వేసిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని అనుమతి లేకుండా ఆరు రోజులు సెలవులు తీసుకున్న తిమ్మాపురం ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

Recent

- Advertisment -spot_img