Homeఫ్లాష్ ఫ్లాష్Vijay oil:విజయ బ్రాండ్ ఉత్పత్తులను అందరూ ఆదరించాలి-మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Vijay oil:విజయ బ్రాండ్ ఉత్పత్తులను అందరూ ఆదరించాలి-మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Vijay oil:కల్తీలేని ఉత్పత్తులు ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.విజయ బ్రాండ్ నుండి నాణ్యమైన వంటనూనెలు వస్తున్నాయని అన్నారు.ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉత్పత్తులు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలున్నాయని తెలిపారు.నాణ్యమైన వంటనూనెల తయారీపై దృష్టిపెట్టిన ఆయిల్ ఫెడ్,వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కొబ్బరి, రైస్ బ్రాన్, పామాయిల్, గానుగ నూనెలు ఉత్పత్తి చేస్తున్న దని వెల్లడించారు.విజయ బ్రాండ్ ఉత్పత్తులను అందరూ ఆదరించాలని కోరారు.హైదరాబాద్ లోని అన్ని రైతుబజార్లలో విజయ ఔట్ లెట్లు ఉన్నాయని,మొత్తం 33 జిల్లాకేంద్రాలలో ఔట్ లెట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో మార్కెట్లోకి  విజయ బ్రాండ్ వేరుశెనగ గానుగనూనె విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ సురేందర్ తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img