VIRAL: సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం కొందరు ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు. రకరకాల స్టంట్స్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. తాజాగా యూపీలోని హాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన పనికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. ఓ వ్యక్తి ఏడుగురు పిల్లలను తన బుల్లెట్ బైక్పై కూర్చోబెట్టుకుని.. వారి ప్రాణాలను లెక్కచేయకుండా బండిని నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు అతనికి వార్నింగ్ ఇచ్చి.. రూ. 9500 చలాన్ విధించారు.