Homeహైదరాబాద్latest NewsVIRAL: టీచర్ గారు ఏంటిది.. రీల్స్ కోసం ఇదేం పాడు పని.. వీడియో వైరల్..!

VIRAL: టీచర్ గారు ఏంటిది.. రీల్స్ కోసం ఇదేం పాడు పని.. వీడియో వైరల్..!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఓ టీచరమ్మ చేసిన పని చూస్తే మీరు ఆశ్చర్య పోతారు. పీపీయూ పరీక్షలను ఇవాల్యుయేషన్ చేసే సమయంలో.. బిహార్‌కు చెందిన ఒక టీచర్స్ రీల్స్ చేసింది. ఇలా చేయడమే పెద్ద తప్పయితే, అంతకుమించి మరో పెద్ద తప్పు ఆమె చేసింది. విద్యార్థులు రాసిన ఆన్సర్లను ఏమాత్రం గమనించకుండానే.. రైట్ మార్క్ వేస్తూ వెళ్లిపోయింది. ఓవైపు ఇతర టీచర్లు సరిగ్గా ఇవాల్యుయేట్ చేస్తూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తుంటే.. ఈ టీచరమ్మా మాత్రం రీల్స్ కోసం పోజులు కొడుతూ, జవాబుల్ని గమనించకుండా రైట్ మార్క్ వేసుకుంటూ వెళ్లింది. ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. అవి వివాదాస్పదంగా మారాయి. ఈ రీల్స్‌పై నెటిజన్ల నుంచి తారాస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు రంగంలోకి దిగి.. ఆమెపై చర్యలు తీసుకున్నారు. ఆ టీచరమ్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img