Homeహైదరాబాద్latest Newsఆ ఒక్క షాట్..ఎందుకంత కసితో?

ఆ ఒక్క షాట్..ఎందుకంత కసితో?

Idenijam, Webdesk : నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రన్ మెషీన్ వారాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దుమ్ముదులిపే ప్రదర్శన చేసీ మరోసారి క్రీడాప్రపంచానికి తన అట రుచిని చూపించాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ 181 పరుగులకే చాప చుట్టేసింది. అయితే ఇన్నింగ్స్ 16 వ ఓవర్లో సామ్ కరన్ బౌలింగ్ లో కొట్టిన ఓ సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. బలాన్నంతా కూడదీసుకొని కోపంతో, కసితో కొట్టినట్టుగా ఆ షాట్ ఉంది. సాధారణంగా క్లాసిక్ షాట్లు ఆడే విరాట్ ,ఇంతటి బలమైన షాట్ ఆడటం వెనుక బిగ్ రీజన్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్లకు డేంజర్ సంకేతాలు పంపించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ ఒక్క షాట్ ద్వారా గమనించవచ్చు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌ ముందువరకూ ఫామ్‌లేమితో ఇబ్బందిపడ్డ విరాట్.. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. కాగా ఎప్పటికప్పుడు కొత్తకొత్త షాట్లతో తన ఆటతీరును మెరుగుపరుచుకుంటున్నట్లు వన్డే ప్రపంచకప్ జరుగుతున్న సందర్భంలో కోహ్లీ చెప్పాడు. రాబోయే యువతరం కోసం ఈ మెలకువలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించాడు. 2028 లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా చేర్చడానికి ప్రధాన కారణం రన్ మెషీన విరాట్ కోహ్లీ అని నిర్వాహకులు గతంలో తెలిపిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img