Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ కి ఓటు వేయడం అంటే వారి మోసాలను అంగీకరించినట్లే: మాజీ ఎమ్మెల్యే

కాంగ్రెస్ కి ఓటు వేయడం అంటే వారి మోసాలను అంగీకరించినట్లే: మాజీ ఎమ్మెల్యే

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ పట్టణంలో శనివారం ఉదయం వాకర్సు , క్రీడాకారులనిఓటు అభ్యర్థించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ గా రాకేష్ రెడ్డిని గెలిపించి ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపించాలని ఆయన కోరారు.రైతులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. హామీలు అమలు చేయకుండా మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని,పట్టబద్రులు సహా అన్ని వర్గాల ప్రజల సమస్యలకు గొంతుగా మేము పోరాటం చేస్తాంమని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీఎన్నికల్లో ఎప్పుడైనా బిఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు కూడా గెలుపు ఖాయమని,కాంగ్రెస్ పని అయిపోయింది. ఆరు నెలల్లో మోసాలు అర్థం అయ్యాయి.బస్సు తప్ప అంతా తుస్స్ అని అన్నారు. బాండ్ పేపర్లు పంచి పచ్చి మోసం చేశారు.ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు.ఈకార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img