– నేడు టీమిండియా-ఆసీస్ రెండో టీ20
– కేరళలో విస్తారంగా వర్షాలు
– టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
ఇదేనిజం, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం తిరువనంతపురంలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే తిరువనంతపురంలో శనివారం భారీ వర్షం పడింది. దీంతో గ్రీన్ ఫీల్డ్ స్టేడియం జలమయమైంది. పిచ్పై కవర్లు కప్పినప్పటికీ మైదానంలో భారీగా నీరు నిలిచింది. ప్రస్తుతం ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా కేరళలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కాగా రేపు తిరువనంతపురంలో వాతావరణం ఎలా ఉంటుందన్నది అనిశ్చితిగా మారింది. విశాఖలో జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా రెండో టీ20లోనూ గెలిచి ఆసీస్పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. వరుణుడు కరుణిస్తే మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగే అవకాశం ఉన్నది.