కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 88కి పెరిగినట్లు కేరళ రెవెన్యూశాఖ మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ ఘటనలో 116 మందికి గాయాలైనట్లు గుర్తించారు. వీరిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.