Homeజిల్లా వార్తలుపారిశ్రామికాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

పారిశ్రామికాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– సీఎం రేవంత్ రెడ్డి

ఇదే నిజం, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే భాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు. పారిశ్రామిక దిగ్గజం ఫాక్స్‌కాన్‌కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రిని సెక్రటేరియట్​లో కలిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామన్నారు. కాబట్టి, పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారం అందిస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img