Weather Report: దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు, కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఈ మేరకు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ప్రదేశ్ల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక అసోం, మేఘాలయాల్లో ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. ఈనెల 12న పశ్చిమబెంగాల్, సిక్కింలలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.