పశ్చిమ బెంగాల్లో కాంచన్జంఘా ఎక్స్ప్రెస్ని గూడ్స్ ట్రైన్ ఢీకొట్టడానికి కారణమేంటో అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ‘‘డార్జిలింగ్ వద్ద గూడ్స్ ట్రైన్కి రెడ్ సిగ్నల్ పడింది. కానీ లోకోపైలట్ దాన్ని గమనించకుండా వెళ్లిపోయాడు. అప్పటికే ఆ ట్రాక్ పై కాంచనజంగ ఎక్స్ప్రెస్ ఉంది. ఫలితంగా రెండు రైళ్లూ ఒకే ట్రాక్పైకి వచ్చాయి. దీంతో ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి అని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.