టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్ రానున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ను బౌలింగ్ కోచ్గా నియమించినట్లు సమాచారం. సెప్టెంబరు 1 నుంచి అతని కాంట్రాక్ట్ మొదలవుతుందని వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్తో మోర్కెల్ కోచ్గా తన జర్నీని మొదలుపెట్టనున్నారు.