HomeDevotionalఉగాది ఎందుకు జరుపుకుంటారు?

ఉగాది ఎందుకు జరుపుకుంటారు?

తెలుగువారి మొదటి పండుగ ఉగాది. అందుకే ఈ పండుగను తెలుగు సంవత్సరాదిపండుగ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది.. ఈ ఏడాదిలో ఏప్రిల్ 9 న వచ్చింది. ఈ ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటారు. దీని అర్థ ఈ సంవత్సరం క్రోధమును ఎక్కువగా కలిగి ఉంటారు. కుటుంబం, మనుషుల మధ్య కోపాలతో కలహాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

యుగాది లేదా ఉగాది అనే పదాలు ‘యుగ’ (యుగం), ‘ఆది’ (ప్రారంభం) అనే సంస్కృత పదాల నుంచి ఉద్భవించాయి, ఇది ‘కొత్త యుగం ప్రారంభం’ అని సూచిస్తుంది. మాములుగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి చివరలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే ఈ రోజు హిందువులకు చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహారాష్ట్రలో గుడి పడ్వా, తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అని, కర్ణాటకలో యుగాది వంటి పేర్లతో ఉగాది పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడు. తరవాత అతను రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలను సృష్టించాడు. ఈ సంవత్సరాన్నే ఆది పర్వం అంటారు. ఈ పండుగ మొదలయ్యే వారం ముందు నుంచి సందడి మొదలవుతుంది. ఉగాది పండుగను సంక్రాంతి లాగే ఘనంగా ఎవరికి ఉన్నంతలో వాళ్లు జరుపుకుంటారు. ఉగాది రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కడతారు. తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. పాయసం, పులిహోర తో పాటుగా బొబ్బట్లను కూడా తప్పనిసరిగా చేసుకొని దేవుడికి సమర్పిస్తారు. ఉగాది పచ్చడిని చేసుకొని ఇంటిల్లి పాది ఆనందంగా ఆరగిస్తారు.

Recent

- Advertisment -spot_img