Homeజిల్లా వార్తలుచదువు పూర్తయ్యేవరకు అండగా ఉంటా

చదువు పూర్తయ్యేవరకు అండగా ఉంటా

– సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి
– గిరిజన విద్యార్థినికి హామీ

ఇదేనిజం, సూర్యాపేట : ఉన్నత చదువులకు ఆటంకంగా నిలిచిన ఆర్థిక పరిస్థితితో దిక్కుతోచని స్థితిలో ఉన్న గిరిజన విద్యార్థినికి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి అండగా నిలిచారు. ఆమె విద్యాభ్యాసం పూర్తి అయ్యే వరకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. వివరాల్లోకి వెళ్తే..పెన్‌ పహాడ్‌ మండలం లాల్‌ సింగ్‌ తండాకి చెందిన బానోతు ఐశ్వర్య చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తున్నది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్‌ సీటు సాధించిన ఐశ్వర్యకు పేదరికం వల్ల కనీస అవసరాలు కూడా భరించలేని స్థితిలో ఉంది. దీంతో అక్కడి స్థానిక నాయకులు పరిస్థితిని ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ఐశ్వర్యతో పాటు ఆమె తల్లిని సూర్యాపేటకు పిలిపించి మాట్లడారు. చదువు పూర్తయ్యంత వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. టాలెంట్‌ ఉన్న ఆడబిడ్డకి అండగా నిలవడం తనకు అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. ఐశ్వర్య భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అండగా నిలిచిన ఎమ్మెల్యేకు ఐశ్వర్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img