ఏపీ నుంచి పోటీ చేసే అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయాలని ఉందని బీజేపీ మాజీ ఎంపీ, సీనియర్ నటి జయప్రద అన్నారు. తాను ఉత్తరప్రదేశ్లో ఉన్నా తెలుగుబిడ్డనేనని అన్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటానన్నారు. ఎవరైతే రాజధాని తీసుకురాగలరో, యువతకు ఉపాధి కల్పించగలరో వారికే తన మద్దతన్నారు. స్టార్ క్యాంపెయినర్గా ఆహ్వానిస్తే తప్పకుండా టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానన్నారు.