Homeహైదరాబాద్latest NewsParis Olympics: చరిత్ర సృష్టించిన మహిళల టెన్నిస్‌ జట్టు.. క్వార్టర్స్ చేరిన భారత్!

Paris Olympics: చరిత్ర సృష్టించిన మహిళల టెన్నిస్‌ జట్టు.. క్వార్టర్స్ చేరిన భారత్!

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన ప్రీ-క్వార్టర్స్‌లో భారత్ 3-2తో రొమానియోపై విజయం సాధించింది. మణికా బాత్రా, ఆకుల శ్రీజ, కామత్ అర్చన గిరీష్‌లతో కూడిన భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు అద్భుత ప్రదర్శనతో టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన తొలి భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టుగా చరిత్ర సృష్టించింది. మణికా బాత్రా సంచలన ఆటతీరుతో భారత్ మ్యాచ్ గెలిచింది.

Recent

- Advertisment -spot_img