ఇదేనిజం, శేరిలింగంపల్లి : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ముద్రించిన అవగాహన పోస్టర్ ను జయరాం, అదనపు ఉప పోలీసుకమీషనర్, మాదాపూర్ జోన్, సైబరాబాదు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన ఎదురయ్యే అనర్థాలను వివరించారు. పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల మన దేశంలో లక్షలాదిమంది, ప్రపంచంలో కోట్లాదిమంది మరణాల పాలవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాణి సాంబశివరావు, జనార్ధన్, పాలం శ్రీను, ధర్మసాగర్, జీ వి.రావు, బాలన్న, నేమాని విశ్వశాంతి, జకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.