దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో టమాటా దిగుబడులు భారీగా తగ్గాయి. గడిచిన 20రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో టమాటా ధరలు పెరిగి కిలోకు రూ.50కి వద్ద స్థిరపడ్డాయి. తెలంగాణలో కిలో టమాటా ధర రూ.80కిపైగా పలుకుతోంది. సరఫరా కొరతతో కిలో టమాట రూ.100 దాటే అవకాశం ఉండటంతో టమాటాలను సబ్సిడీపై అందించాలని ప్రజలు ప్రభుత్వాలను కోరుతున్నారు.