దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 73,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు కుంగి 22,365 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో టాటా మోటార్స్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. సన్ఫార్మా, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్యూఎల్, మారుతీ, హెచ్సీఎల్ టెక్ షేర్లు అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో కొనసాగుతున్నాయి.