హైదారాబాద్ః రష్యాకు చెందిన మైఖేల్ లిట్విన్ ఓ యూ ట్యూబర్. సాహసాలు, ప్రాంక్ వీడియోలు చేస్తూ, ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేస్తుంటాడు.
ఇటీవల తాను రూ.2.5 కోట్లు పెట్టి మెర్సిడెస్ కారును కొన్నాడు. కానీ కారు తరుచూ బ్రేక్డౌన్ అవుతూ ఇబ్బంది పెడుతోంది.
డీలర్ వద్దకు తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు.
దీంతో ఏకంగా మెర్సిడెస్ కారునే తగులబెట్టేందుకు డిసైడ్ అయిపోయాడు. కారును వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్లి దానిపై పెట్రోల్ పోశాడు.
ఆ తతంగాన్ని అంతా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది.
ఇక నెటిజన్లు ఊరుకుంటారా.. తమదైన శైలీలో కామెంట్లు చేస్తున్నారు. అంత విలువైన కారును ఎలా కాల్చేశావురా.. ఈ వీడియోకు వచ్చిన పైసలతో మరో రెండు మెర్సిడెస్ కార్లను కొనుక్కుంటాడులే అంటూ కామెంట్లు చేస్తున్నారు.