Largest church : ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్ ఆంద్రాలో..
Largest church – ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న బైబిల్ మిషన్ గూటి చర్చి ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్ గా గుర్తించింది లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్.
61ఎకరాల విస్తీర్ణం లో (1, 74,040 చ.అ.) 60వేలమంది కూర్చునేలా దీనిని రూపొందించారు.
భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక , తెలంగాణా రాష్ట్రాలలోని 114 శాఖలు ఈ చర్చ్ ఆధీనంలోనే ఉన్నాయి.
2021 డిసెంబర్ 4వ తేదీన అనంతపురంలో లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ చర్చిని వరల్డ్ లార్జెస్ట్ చర్చి గా గుర్తించింది.
అద్బుత కుమార్కు డా. రాజీవ్ శ్రీవాస్తవ్ (వైస్ ప్రెసిడెంట్, డబ్ల్యుబిఆర్-ఇండియా) డాక్టర్ ఉల్లాజి ఎలియాజర్ (జాయింట్ సెక్రటరీ, డబ్ల్యుబిఆర్ – సౌత్ రీజియన్ ఇండియా)లు గుర్తింపునకు సంబంధించిన సర్టిఫికేట్ను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి జయరాం, గద్వాల్ ఎం ఎల్ ఏ బి.కృష్ణ మోహన్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తోగూరులు హాజరయ్యారు.
విదేశీయుల సహాయం లేకుండా..
బైబిల్ గూటి చర్చి ప్రపంచంలోనే అతి పెద్ద చర్చిని రెవ. బి అద్బుత కుమార్ స్థాపించారు.
అత్యంత విశాలమైన ప్రార్థనా మందిరాలు, ప్రేయర్ టవర్, బైబిల్ కళాశాల, అతిపెద్ద కిచెన్, వాటర్ ట్యాంక్లు , కాంపౌండ్ వాల్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
విదేశీయుల సహాయం లేకుండా స్థానికుల సహాయంతో నిర్మించిన చర్చ్ ఇది.
దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్రైస్తవం పట్ల అంతర్జాతీయంగా బాగా గుర్తింపు వచ్చింది.