Crossed Border For Lover : ప్రియురాలికోసం బోర్డర్ దూకేశాడు
Crossed Border For Lover – భారత్లోని ప్రియురాలిని కలిసేందుకు సరిహద్దు కంచె దాటి దేశంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ యువకుడ్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు అరెస్ట్ చేశారు.
22 ఏండ్ల మహ్మద్ అమీర్ను శనివారం అర్థరాత్రి రాజస్థాన్ శ్రీ గంగానగర్ జిల్లాలోని అనుప్గఢ్లో అదుపులోకి తీసుకున్నారు.
అతడ్ని ప్రశ్నించగా ముంబైకి చెందిన మహిళతో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడిందని తెలిపాడు.
తాము ప్రేమించుకుంటున్నామని త్వరలో పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.
భారత్ వచ్చేందుకు వీసా కోసం అప్లై చేయగా తిరస్కరించారని, అందుకే సరిహద్దు దాటి వచ్చినట్లు వెల్లడించాడు.
కాగా, అమీర్ చెప్పినదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ ఆనంద్ శర్మ తెలిపారు.
పాకిస్థాన్లోని బహవల్పూర్ జిల్లా హసిల్పూర్ తహసీల్కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు.
అతడి వద్ద మొబైల్ ఫోన్, డబ్బులు తప్ప మరేమీ లేవన్నారు.
రాజస్థాన్ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలోని పాకిస్థాన్ ఊరి నుంచి అమీర్ సరిహద్దు కంచెను దాటి భారత్లోకి ఎలా ప్రవేశించాడు అన్నదానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
రాజస్థాన్లోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబైకి ఎలా వెళ్తావని అడగ్గా కాలి నడకన వెళ్తానని అమీర్ చెప్పినట్లుగా ఎస్పీ శర్మ తెలిపారు.
అతడిని మరింతగా ప్రశ్నించిన తర్వాత ముంబైలోని మహిళ గురించి తెలుసుకుంటామన్నారు.
చెప్పిన వివరాలు వాస్తవమైతే పాక్ రేంజర్లకు అతడ్ని అప్పగిస్తామని వెల్లడించారు.
దీంతో ఇంత కష్టపడి సరిహద్దు కంచె దాటి వచ్చిన అమీర్, ముంబైలోని తన ప్రియురాలిని కలిసే అవకాశం లేనట్లుగా తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి
డాటా సైన్స్లో కెరీర్ ట్రైనింగ్