- మునుగోడు సభలో సీఎం కేసీఆర్
Munugodu KCR : రైతుల మోటర్లకు మీటర్లు పెట్టే నరేంద్రమోడీకీ, అతని పార్టీ బీజేపీకీ మీటర్లు పెట్టాలని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మునుగోడు ఆశీర్వాధ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ పార్టీనీ తీవ్రంగా విమర్శించారు. ఓటు అనే ఆయుధంతో చక్కటి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. దే|శంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను , అరాచకాలను, దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్రలను అందరూ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రగతీశీల శక్తులు ఏకం కావాలి. దేశాన్ని కాపాడాలి. టీఆర్ెస్ కొట్లాడటం మొదలు పెడితే అంతు చూసే దాకా పోరాటం చేస్తుంది.
బిడ్డా అమిత్షా మా నదీ జలాల్లో మా వాట ఎందుకు ఇవ్వవు. రేపు మునుగోడు వస్తున్నావు కదా సమాధానం చెప్పు. బీజేపీ దద్దమ్మలు రేపు అన్నింటికి సమాధానం చెప్పాలి. ఎనిమిదేళ్లు అయ్యింది బీజేపీ కేంద్రంలోకి వచ్చి న దర్వాత ఒక్క మంచి పనైన చేశారా చెప్పండి. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ తెగనమ్ముతున్నాడు. రైతుల వ్యవసాయభూములను కూడా కార్పోరేట్లకు అమ్ముతాడు.
ఈడీ, బోడీ కేసులకు భయపడం. కాంగ్రెస్పార్టీకీ ఓటేస్తే మోరీలో వేసినట్లే , వేస్ట్ అవుతుంది. ఆలోచించండి.