Cricket shikhar dhawan:ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. టీ20 వరల్డ్కప్లో పాల్గొనే ప్లేయర్లకు రెస్ట్ ఇస్తున్న నేపథ్యంలో కెప్టెన్సీని ధావన్కు అప్పగించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 16వ తేదీ నుంచి టీ20 వరల్డ్కప్ ఆస్ట్రేలియాలో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలను ఇండియా ఆడనున్నది. తిరువనంతపురంలో సెప్టెంబర్ 28వ తేదీన తొలి టీ20 జరగనున్నది. రెండవ టీ20 అక్టోబర్ 2న, 4న ఇండోర్లో మూడవ టీ20 జరుగుతుంది. ఇక వన్డే సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభంకానున్నది. ఆ టీమ్కు శిఖర్ ధావన్ లీడ్ చేస్తాడు. రాంచీ, ఢిల్లీలో అక్టోబర్ 9, 11 తేదీల్లో రెండవ, మూడవ వన్డేలు జరగనున్నాయి.