Britan: ఒకప్పుడు భారత దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ పౌరుల దేశం బ్రిటన్ ను ఇప్పుడు భారత సంతతికి చెందిన వ్యక్తి పరిపాలించనున్నాడు. అతనే రిషి సునాక్. బ్రిటన్ పార్లమెంట్ లో 100మంది కంజెర్వెటర్స్ ఎంపీ ల మద్దతు ఉంది. బ్రిటన్ ప్రధాని లీజ్ ట్రస్ తప్పుకోవడతో ఈయన పోటీ పడుతున్నాడు.
రిషి సునాక్ భారత సంతతికి చెందిన నాయకుడు..ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునాక్ .నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షతా మూర్తిని 1980లో రిషి సునాక్ పెళ్లాడారు. ప్రజలు రిషి సునాక్ ను ‘డిషీ రిషి’ అని పిలుచుకుంటారు.కరోనా మహమ్మారి కాలంలో రిషి సునాక్ రూపొందించిన ఆర్థిక విధానాలతో ఆయనకు ప్రజాదరణ పెరిగింది. గొప్ప ఆర్ధిక వేత్త కావడం, బ్రిటన్ లో పెరిగిన ఆర్ధిక పరిస్థితులను చక్క దిద్దుతానని హామీ ఇవ్వడం, పార్లమెంట్ లో ఎక్కువ మంది సభ్యుల బలం ఉండటం తో ఈయన ప్రధాని కావడం పక్కా.
భారత మూలాలు
రిషి పూర్వీకులు పంజాబ్కు చెందినవారు. తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాకు వలస వెళ్లారు. అక్కడనుంచి 1920 లో తూర్పు ఆఫ్రికా నుంచి బ్రిటన్ వెళ్లి స్థిర పడ్డారు. రిషి తండ్రి యష్ వీర్ కెన్యాలో జన్మించాడు. రిషి తల్లి ఉష టాంజనియా కి చెందిన వారు.వీరిద్దరికి 1980లో మే 12న వీరికి రిషి సునక్ జన్మించారు. 2006లో స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి రుషి ఎంబీఏ చేశారు