theft:రెండు టన్నుల టమాటాల వాహనంతో ఆగంతుకులు పరారయ్యారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలో చోటుచేసుకుంది. ఓ రైతు దాదాపు రూ. మూడు లక్షల విలువైన 3,750 కేజీల టమాటాలను బొలేరో వాహనం ఎక్కించి, డ్రైవర్తో కలిసి స్థానిక ఆర్ఎంసీ యార్డుకు వచ్చారు. అక్కడ వాహనాన్ని నిలిపి డ్రైవర్తో కలిసి టీ తాగేందుకు వెళ్లారు. అదే అదనుగా దుండగులు వచ్చి వాహనం ఎత్తుకుపోయారు. ఈ చోరీపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాము మార్కెట్కు వస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు తమను వెంబడించారని తెలిపారు. మార్గమధ్యలో ఒకచోట తమ వాహనం వారి వాహనాన్ని ఢీకొట్టిందంటూ నాటకమాడుతూ గొడవ పెట్టుకుని, నగదు డిమాండ్ చేశారని.. బాధితులు పేర్కొన్నారు. వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు.