adipurush ott: రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఈ మూవీ థియేటర్ లో పెద్దగా ఆడలేదు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తీవ్రంగా నిరుత్సాహ పడ్డారు. ఈ సినిమాలోని డైలాగ్స్, కథ మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నా.. మూవీ రిలీజ్ అయ్యాక పెద్దగా సక్సెస్ కాలేదు. రామయణ కథను, పాత్రలను తప్పుగా చిత్రీకరించారన్న విమర్శలు వచ్చాయి.
కాగా తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలోని గ్రాఫిక్స్ మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. మరి ఆదిపురుష్ మూవీ కనీసం ఓటీటీ ప్రేక్షకులనైనా ఆకట్టుకుంటుందా? అన్నది వేచి చూడాలి.