– రాహుల్ను అవమానించారంటూ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
ఇదేనిజం, హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్నది. రాహుల్ గాంధీని అవమానించారంటూ గాంధీ భవన్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.