ఎల్సీయూ(లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) కాన్సెప్ట్తో ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు తెరకెక్కించి బ్లాక్ బ్లస్టర్ హిట్లు కొట్టాడు తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఇళయ దళపతి విజయ్తో తీసిన ‘లియో’ఇటీవల రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. అయితే, లోకేశ్ ఎల్సీయూ కాన్సెప్ట్లో భాగంగా తీసిన మొదటి సినిమా ఖైదీ. 2019లో వచ్చిన ఈ మూవీలో కార్తీ హీరోగా నటించాడు. లోకేశ్ ఎల్సీయూ కాన్సెప్ట్ మూవీస్లో ది బెస్ట్ వర్క్గా ఖైదీ నిలిచింది. తాజాగా లియో సినిమా రిలీజైనప్పటి నుంచి ఫ్యాన్స్ మళ్లీ ఖైదీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఖైదీలో కార్తీ చేసిన ‘ఢిల్లీ’క్యారెక్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఈ సినిమా వచ్చి అప్పుడే నాలుగేళ్లు అయ్యిందంటూ తాజాగా నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ‘ఢిల్లీ’మళ్లీ రాబోతున్నాడంటూ ఓ క్రేజీ అప్డేట్ను వీడియోలో అందించింది. మరోసారి అందరి ఎగ్జయిట్మెంట్కు ఏ మాత్రం తగ్గకుండా సెటిల్ చేసేలా ఖైదీ–2 ఉంటుందని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థ తెలిపింది. దీంతో మూవీ లవర్స్ ఖైదీ–2 కోసం ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.