ఈ ఏడాది జనవరిలో రిలీజైన ‘పఠాన్’సినిమా హిట్తో వరుస ఫ్లాప్ల నుంచి బయటపడ్డారు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్. పఠాన్ బ్లాక్ బస్టర్గా నిలిచి రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసింది. మూడేళ్లుగా ఢీలాపడ్డ బాలీవుడ్ బాక్సాఫీసుకు కొత్త ఊపిరి పోసింది. అయితే, గత నెలలో ‘జవాన్’మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు షారుఖ్ ఖాన్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ రికార్డులను బ్రేక్ చేస్తోంది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 7న ‘జవాన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ-షారుఖ్ కాంబినేషన్కు ప్రేక్షకులు ఫిదా అవ్వడంతో సినిమా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీ విడుదలై శుక్రవారానికి 50రోజులు పూర్తి కావడంతో దర్శకుడు అట్లీ స్పెషల్ పోస్ట్ చేశారు. ‘జవాన్’తో మీ ముందుకు వచ్చి 50 రోజులవుతోంది. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకుంటోంది. ప్రపంచమంతా దీని హవా కనిపిస్తూనే ఉంది’ అంటూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. తొలిరోజే రూ.100కోట్లు వసూళ్లు చేసిన జవాన్ ఇప్పటి వరకు రూ.1,145 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. 50వ రోజు కూడా సుమారు రూ.11లక్షలు వసూళ్లు చేసింది. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించగా.. విలన్గా విజయ్ సేతుపతి ఆకట్టుకున్నారు.