టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం 2019లో హార్ట్ ఆపరేషన్ తర్వాత సినిమాలను తగ్గించారు. 2020లో వచ్చిన అల వైకుంఠపురం మూవీలో ఓ పాటలో కనిపించిన ఆయన.. కరోనా పీరియడ్ రావడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే, 2021లో జాతి రత్నాలు సినిమాలో మళ్లీ కనిపించి తన ట్రేడ్ మార్క్ కామెడీతో ఆకట్టుకున్నారు. ఈ ఏడాది రిలీజైన రంగమార్తాండ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్లో నటించి.. కామెడీతో పాటు ట్రాజెడీని సైతం పండించగలనని మరోసారి నిరూపించారు. మళ్లీ ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపిస్తున్న ఆయనకు తగ్గ సాలిడ్ పాత్రలు తక్కువే వస్తున్నాయన్న టాక్ ఉంది. అయితే, లేటెస్ట్గా తరుణ్ భాస్కర్ తీసిన ‘కీడా కోలా’ మూవీలో బ్రహ్మీ కాస్త ఎక్కువ సేపు కనిపించి అలరిస్తారని మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్కు కిక్ ఇచ్చే మరో ఇంట్రెస్టింగ్ బజ్ బయటికి వచ్చింది. దర్శకుడు శంకర్
లోక నాయకుడు కమల్హాసన్తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘భారతీయుడు–2’లో బ్రహ్మానందం కూడా ఒక పార్ట్ అని ఇప్పుడు కన్ఫార్మ్ అయ్యింది. శంకర్ పెట్టిన లేటెస్ట్ ట్విట్టర్ పోస్ట్లో అయితే బ్రహ్మానందం పేరుని కూడా మెన్షన్ చేయడంతో ఈ లెజెండరీ నటుడిని భారీ సినిమాలో చూడబోతున్నట్లు ఖరారైంది. అయితే, ఈ మూవీలో బ్రహ్మనందం ఎలాంటి క్యారెక్టర్లో కనిపించనున్నారో చూడాలంటే మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.