అక్కినేని నట వారసుడు, యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరోవైపు నాగచైతన్య తొలిసారిగా నటిస్తున్న వెబ్ సిరీస్ దూతను ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్ను నిర్మిస్తోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ హర్రర్ డ్రామా సిరీస్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్లో ఈ వెబ్ సిరీస్ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. శరద్ మరార్ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన దూత సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా.. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివి ఉండనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ హర్రర్ సిరీస్ తప్పకుండా ఆడియన్స్ను థ్రిల్ చేయడంతో పాటు వెబ్ సిరీస్ల జానర్లోకి ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్యకు మరింత క్రేజ్ తీసుకొస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.