– రాహుల్ గాంధీ, కేసీఆర్కు రాజాసింగ్ సవాల్
– బీజేపీ ఓబీసీని ప్రధాని చేసింది
– మైనార్టీ, దళిత, గిరిజన నేతలని రాష్ట్రపతి చేసింది
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం కేసీఆర్లపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల పట్ల రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించే దమ్ముందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ బీసీలపై ప్రేమ ఒలకబోస్తున్నారని, వారు బీసీని సీఎం చేస్తామని ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఓబీసీ నేతను భారతీయ జనతా పార్టీ ప్రధాని చేసిందన్నారు. అందేకాదు మైనార్టీ, దళిత, గిరిజన నేతలను రాష్ట్రపతిలను చేసిన చరిత్ర కూడా బీజేపీదేనన్నారు. కానీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు సీఎం పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అర్హులైన నాయకులను ఇస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీకీ అధికారం ఇవ్వాలని కోరారు. ప్రజలు అన్ని విధాలుగా ఆలోచించి ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.