వెర్సంటైల్ యాక్ట్ విక్రమ్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్గా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన సినిమా ‘ధృవ నక్షత్రం’. చాలా కాలం కిందటే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఈ శుక్రవారం ఈ సినిమా రిలీజ్ ఉండగా.. మేకర్స్ మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లో కూడా ఈ చిత్రం బుకింగ్స్ స్టార్ట్ అవ్వలేదని సమాచారం. దీంతో ధృవ నక్షత్రం మూవీ మళ్లీ వాయిదా పడినట్లుగానే అనిపిస్తోంది. ఈ మూవీకి హరిస్ జయరాజ్ మ్యూజిక్ అందించాడు.