– చిన్నారి మృతి.. తండ్రికి గాయాలు
– ములుగు జిల్లాలో ఘటన
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బైక్ను స్కూల్ బస్సు ఢీకొట్టడంతో చిన్నారి చనిపోగా.. ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా సమ్మక్క, సారక్క తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో జరిగింది. వివరాళ్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఖాతా రమేశ్కు ఏడాది వయసున్న కూతురు ఉంది. శుక్రవారం కూతురితో కలిసి బైక్పై బయటికెళ్లాడు. అతడి బైక్ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. రమేశ్ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు అతడిని ములుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.