– పాలేరుకు రూ.300 కోట్లు పంపించారు
– బీఆర్ఎస్ ప్రజలు ఓట్లతో బుద్దిచెబుతారు
– కాంగెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : పాలేరులో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని కాంగెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణను దొరల, దోపిడీ పాలన నుంచి కాపాడుకోవాలన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్కు అధికారంలోకి రావాలన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు ఓట్లతో బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజల బతుకులు ఆగమయ్యాయన్నారు. బీఆర్ఎస్ పది సంవత్సరాల్లో దోచుకున్న డబ్బుతో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యేకు రూ.300 కోట్లు పంపించారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, కేసీఆర్ పంచే డబ్బు మనదేనని, ఆ డబ్బు తీసుకుని కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు