– రెండూ కుటుంబపార్టీలే
– వారసుల కోసమే ఆ పార్టీల ఆరాటం
– ఎన్నికల ప్రచార సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈ రెండు కుటుంబపార్టీలేనని విమర్శించారు. తమ వారసులను రంగంలోకి దించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన హుజూరాబాద్ లో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. వారసుల పదవుల కోసం కాంగ్రెస్, బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు. ఎంఐఎం అధినేత ఒవైసీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని.. అందుకే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని ఫైర్ అయ్యారు. మజ్లిస్కు భయపడి 4శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ సర్కారు రూ. 7 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. బీజేపీ గెలిస్తే రాష్ట్రానికి బీసీ వ్యక్తి సీఎం అవుతారని హామీ ఇచ్చారు. బీజేపీని గెలిపిస్తే.. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గిస్తామని.. పేద మహిళలకు ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు.