ఇదే నిజం, కాశిబుగ్గ వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ఈనెల 16న ఆటోలు బంద్ చేస్తున్నట్టు తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద శ్రీధర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకంగా ఆటో బంద్కు పిలుపు ఇస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.