– బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రకటన
ఇదేనిజం, హైదరాబాద్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లాడని.. పోలీసులకు సైతం అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వార్తలపై తాజాగా ప్రశాంత్ క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికీ పారిపోలేదని ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. గత ఆదివారం బిగ్ బాస్ విన్నర్ గా ప్రశాంత్ ను ప్రకటించిన అనంతరం అన్న పూర్ణ స్టూడియో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఇతర కంటెస్టెంట్ల మీద పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. కొన్ని కార్లు ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సుల ఆద్దాలు సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ మీద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్ను చేర్చగా, ఎ-2గా అతని సోదరుడు మనోహర్ను, ఎ-3గా అతని స్నేహితుడు వినయ్ను చేర్చారు. ఎ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్ (25)ను, అంకిరావుపల్లి రాజు (23)ను అరెస్ట్ చేశారు. కాగా అప్పటి నుంచి ప్రశాంత్ కనిపించడం లేదని.. వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదని ఇన్ స్టా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. ఇంట్లోనే ఉన్నానని తెలిపాడు. తాను ఏ తప్పూ చేయలేదన్నాడు. రియాల్టీ షో నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఫోన్ వాడలేదని చెప్పాడు.