– చంచల్ గూడ జైలుకు తరలింపు
ఇదేనిజం, హైదరాబాద్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గత ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన దాడి ఘటనపై పల్లవి ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా బుధవారం రాత్రి గజ్వేల్ మండలం కొల్లూరులో పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట వీరిని హాజరు పరిచారు. విచారణ జరిపిన కోర్టు ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరిని జూబ్లీ హిల్స్ పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.