ఇదే నిజం, చింతలమానేపల్లి : అయోధ్య రాములవారి అక్షింతలను కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం చిత్తమా గ్రామంలో ఇంటింటికి పంపిణీ చేశారు. అర్చకులు అవుత్కర్ రామయ్య ఆధ్వర్యంలో అక్షింతల పంపిణీ జరిగింది. ముందుగా అక్షింతలను గ్రామంలో ఊరేగించారు. అనంతరం అక్షింతలు పంపిణి చేశారు. కార్యక్రమంలో అర్చకులు అవుత్కర్ రామయ్య, మడవి సొమయ్య ఆత్రం బాపు మాడవి వసంత్ ఆత్రం సత్యవన్ బండు దివాకర్ తదితరులు పాల్గొన్నారు