TG : యాదాద్రి భువనగిరిలో మైండ్ బ్లాక్ అయ్యే ఘటన జరిగింది. ఆన్లైన్ గేమ్స్లో బెట్టింగ్కు అలవాటుపడ్డ ఓ గృహిణి సంసారాన్ని ఆగం చేసుకుంది. చిరువ్యాపారం చేస్తూ తన భర్త పైసాపైసా కూడబెట్టి 16 లక్షలు సంపాదిస్తే..ఆ డబ్బుల్ని, భర్త కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరులా వృథా చేసింది. భువనగిరి పట్టనానికి చెందిన ఓ వ్యక్తి సొంతింటి కల కోసం 16 లక్షలు పోగు చేశాడు. ఇటీవలే 100 గజాల స్థలం కొనుగోలు చేద్దామని నిర్ణయించుకున్నాడు. భార్యను డబ్బులు అడగ్గా..”డబ్బుల్లేవ్. ఆన్లైన్ లో గేమ్ ఆడితే పోయాయ్. 19 వేలు ఉన్నయ్. మళ్లీ డబుల్ సంపాదిస్తా” అనేసరికి భర్త షాక్. అంతే.. డిప్రెషన్తో ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. స్నేహితులు కౌన్సెలింగ్ ఇచ్చినా కోలుకోకపోవడంతో..చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.