విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లి మరో విద్యార్థి హత్యకు గురయ్యాడు. కెనడాలో రెండు రోజుల క్రితం దక్షిణ వాంకోవర్లో అతడ్ని దుండుగులు కాల్చి చంపినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. హత్యకు గురైన భారతీయ యువకుడిని హర్యానాకు చెందిన చిరాగ్ ఆంటిల్ (24)గా గుర్తించారు. కాల్పుల శబ్దం విని స్థానికులు ఘటనా స్థలికి చేరుకునేసరికి కారులో చిరాగ్ విగతజీవిగా పడి ఉన్నాడని వాంకోవర్ పోలీసులు వెల్లడించారు. ‘‘తూర్పు 55 అవెన్యూలోని ప్రధాని వీధిలో ఏప్రిల్ 12న రాత్రి 11 గంటల సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం విన్న స్థానికులు. అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరాగ్ ఆంటిల్ (24) అనే వ్యక్తి వాహనంలో చనిపోయాడు.. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.. విచారణ కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు.