హైదరాబాద్కు చెందిన బిల్డర్ కర్ణాటకలోని బీదర్లో దారుణ హత్యకు గురయ్యాడు. జీడిమెట్లలో నివాసం ఉంటోన్న కుప్పాల మధు అలియాస్ మధు (48) ఓ ముఖ్యమైన పని మీద ఈ నెల 24 న బీదర్ వెళ్లాడు. మరుసటి రోజు కెళ్లి పోలీస్ స్టేషన్ పరిథిలో అతని మృతదేహం లభ్యమైంది. రోడ్డు పక్కనే నిలిపి ఉన్న కారులో మృతదేహాన్ని స్థానికలు గుర్తించారు. వెంటేనే జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. తలపై బండరాయితో మోది, ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపేశారని ప్రాథమిక సమాచారం. ఈ ఘటనతో హైదరాబాద్ బిల్డర్లు షాక్ అయ్యారు.