ఢిల్లీ నుంచి అమరావతి వరకు చోటు చేసుకుంటున్న సమీకరణాలపైన కాంగ్రెస్ ఫోకస్ చేసింది. జగన్ ఓటమి తరువాత తీసుకుంటున్న నిర్ణయాలపైన ఆరా తీస్తోంది. షర్మిల విషయంలో హైకమాండ్ అలెర్ట్ అయింది. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా షర్మిలకు పార్టీలో మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏపీలో కాంగ్రెస్ తీసుకొనే నిర్ణయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.