కర్ణాటక లోని హాసన జిల్లా అరసికెర తాలూకా బైరగొండనహళ్లి కి చెందిన రాజగోపాల్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.
మంగళ వారం సాయంత్రం టూవీలర్ పై బైరగొండనహళ్లి కొండ ప్రాంతం వైపు వెళ్తున్నరు.
సరిగ్గా అప్పుడే వారి బండికి చిరుత అడ్డు వచ్చింది. దాన్ని చూసి రాజగోపాల్ బ్రేక్ వేయడంతో బైక్ పై ఉన్న భార్య మరియు కుమార్తె కింద పడ్డారు.
ఇదే అదునుగా చిరుత వెంటనే వారిపై దాడికి ప్రయత్నించింది.
తన భార్య పిల్లలను ఆ చిరుత చంపేసినట్లే అనుకున్న రాజగోపాల్.. కుటుంబాన్ని కాపాడుకునేందుకు తన ప్రాణాలు కోల్పోయినపర్వాలేదుఅనుకొని చిరుతతో పోరాటం కు సిద్దం అయ్యాడు.
చేతికి అందిన కర్రను తీసుకుని చిరుతను కొట్టాడు. చిరుత కూడా రాజగోపాల్ పైకి దూకింది. తీవ్ర గాయాల పాలయిన రాజగోపాల్.. ఏమాత్రం తగ్గకుండా చిరుతతో తన పోరాటం సాగించి చివరకు చిరుతను చంపేశాడు.
చిరుత చనిపోయే వరకు క్షణం సమయం వృదా చేయకుండా అద్బుత పోరాటం సాగించి తన భార్య పిల్లలను కాపాడుకోవడంతో పాటు తన ప్రాణాలను కూడా కాపాడుకున్నాడు.
ఈ సంఘటన దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.
కుటుంబం కోసం ఏకంగా చిరుతతో పోరాడిన వ్యక్తిగా రాజగోపాల్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.